ఓడిపోయే వారికి బీజేపీ టికెట్ ఇచ్చింది : భూక్య జాను బాయ్

ఓడిపోయే వారికి బీజేపీ టికెట్ ఇచ్చింది : భూక్య జాను బాయ్
  • పార్టీ మార్పుపై త్వరలో ప్రటిస్తానని వెల్లడి

ఖానాపూర్, వెలుగు: బీజేపీ అధిష్టానం ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ను ఓడిపోయే వ్యక్తిని ఇచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, పెంబి జడ్పీటీసీ భూక్య జాను బాయ్ అన్నారు. ఖానాపూర్ ప్రెస్ క్లబ్ లో  బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను కొన్నేండ్లుగా పార్టీని  నమ్ముకుని ఉంటే, తనకు టికెట్​ఇవ్వకుండా అధిష్టానం మోసం చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు.

డబ్బుల కోసమే అధిష్టానం టికెట్ ను అమ్ముకుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తాను ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండడం ఖాయమని వెల్లడించారు. త్వరలోనే తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమం ప్రకటిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గోపాల్ రెడ్డి, రాజేందర్ నాయక్, గంగాధర్, భూమా రెడ్డి, శ్రీను, పవన్, సుధాకర్ ఉన్నారు.