ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్​ స్టూడెంట్లు ఆత్మహత్య

 ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్​ స్టూడెంట్లు ఆత్మహత్య

రామచంద్రాపురం, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్​ ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్​ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు కొందరు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్​ మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఈ నెల 27 న ధర్నా చేస్తామని చెప్పారు. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు ఎడ్ల రమేశ్​, సంధ్య, పద్మావతి తదితరులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్​, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్​ గౌడ్​, విజయపాల్ రెడ్డి, జంగం గోపి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.