జైపూర్ లో బీజేపీ భారీ ర్యాలీ

జైపూర్ లో బీజేపీ భారీ ర్యాలీ

రాజస్థాన్ రాష్ట్రం లో పర్యటిస్తున్న కేంద్ర  హోంశాఖ మంత్రి  అమిత్ షా కు  జైపూర్ ఎయిర్  పోర్టులో ఘన స్వాగతం లభించింది. దాదాపు 50 వేల మంది  కార్యకర్తలతో  భారీ ర్యాలీ నిర్వహించింది  బీజేపీ. 2023లో రాజస్థాన్ లో  గెలుపే లక్ష్యంగా  బీజేపీ పావులు  కదుపుతోంది. పార్టీ  అంతర్గత కుమ్ములాటలకు  చెక్ పెట్టేందుకు  అమిత్ షా  రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో  పాల్గొన్నారు. ఇటీవల జరిగిన  ఉప ఎన్నికల్లో  బీజేపీ ఓడిపోయిన  తర్వాత మాజీ  ముఖ్యమంత్రి   వసుంధర రాజే మళ్లీ క్రియాశీలకంగా  మారారు. 2023లో  వసుంధర రాజేను  ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ప్రకటించాలని ఆమె  మద్దతుదారులు  డిమాండ్ చేస్తున్నారు.