గూగుల్ పే, పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బులు

 గూగుల్ పే, పేటీఎంల ద్వారా  ఓటర్లకు డబ్బులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గూగుల్ పే, పేటీఎంల ద్వారా అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిందన్నారు. బీజేపీ నేత రామచందర్ రావు కామెంట్స్. ఈ మేరకు ఎన్నికల పధాన అధికారి శశాంక్ గోయల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంపిణీ చేసిందని..దొంగ సర్టిఫికేట్స్ తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారన్నారు.పీఆర్సీపై లీకులిచ్చి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి జరగకుండా అధికారులు చూడాలన్నారు.