నల్గొండ అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లైనా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీబంధు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, కొండా భవానీ ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజ సిద్దు, నేతలు పులకరం బిక్షం, గుండ వినయ్ కుమార్, జగ్జీవన్, కాశమ్మ, ముత్యాలరావు, కనకయ్య, మల్లయ్య, మధు, హరి, శ్రీనివాస్, శేఖర్, బ్రహ్మచారి, నీరజ, హైమావతి, కవిత, శ్రీదేవి, దుర్గ,పబ్బు పాల్గొన్నారు.