కాషాయ జెండా ఎగరేయాలి

కాషాయ జెండా ఎగరేయాలి

నిర్మల్/కోల్​బెల్ట్/దహెగాం/నస్పూర్, ​వెలుగు: ప్రతి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త  కృషి చేయాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం దహేగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శీనివాస్,  ఎన్నికల జిల్లా ఇన్​చార్జి, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నస్పూర్​లో  మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, నిర్మల్​ ల్​లో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి, మందమర్రి మండల రూరల్​ ప్రెసిడెంట్​పైడిమల్ల నర్సింగ్ మాట్లాడారు.

అన్ని వర్గాల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయా చోట్ల ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.