భారత్ ఆహ్వనం మేరకు 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో. ఇందులో భాగంగా శనివారం 15 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటిలో ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత లాంటి అంశాలు ఉన్నాయి. ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకకు హాజరవుతున్నందుకు బొల్సోనారో కు థ్యాంక్స్ చెప్పారు. భారత్ కు బ్రెజిల్ కు చాలా వాటిలో పొంతనవుందన్నారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్ కు చేరుకున్న బొల్సొనారోను… రాష్ట్రపతి భవన్ లో ఆహ్వానం పలికారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాందీకి నివాళులు అర్పించారు.
మరిన్ని వార్తలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను వెనక్కి పంపించాలి
టర్కీలో భూకంపం… 18మంది మృతి
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.9లక్షల ఫైన్
Delhi: President of Brazil, Jair Messias Bolsonaro and Prime Minister Narendra Modi witness exchange of Memorandum of Understanding (MoU) between the two countries including those on cybersecurity, bioenergy and health& medicine. pic.twitter.com/cyDmBPdFMj
— ANI (@ANI) January 25, 2020