- నైట్కర్ఫ్యూ బ్రేక్ చేశారని..
- కొత్త జంటను స్టేషన్కు తీస్కెళ్లిన్రు
- గుజరాత్లోని వల్సాద్లో ఘటన
వల్సాద్(గుజరాత్): పందిట్లో లగ్గం చేసుకొని ఇంట్లో కుడికాలుతో అడుగు పెట్టాల్సిన ఓ కొత్త జంట పెండ్లి బట్టలతోనే అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది. నైట్కర్ఫ్యూ వాళ్లను కేసుల పాలు చేసినట్లయింది. గుజరాత్లోని వల్సాద్లో నైట్కర్ఫ్యూ బ్రేక్ చేశారని పోలీసులు ఓ పెండ్లి జంటతోపాటు వారి బంధువులను స్టేషన్కు తీసుకువెళ్లి కేసులు నమోదు చేశారు. గంటల కొద్దీ అక్కడే ఉంచుకొని చివరకు స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. వివరాలు.. కరోనా కేసులు పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం ఇటీవల రాత్రి10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టింది. అంతకు ముందే వల్సాద్లోని తరియావాడ్ ప్రాంతానికి చెందిన పీయూష్ పటేల్(24) పెండ్లి కుదిరింది. సోమవారం పీయూష్పటేల్కు సోనాల్ అనే మహిళతో వివాహం జరిగింది.
వీరిద్దరితోపాటు డ్రైవర్ ఒక కారులో, బంధువులు ఆరుగురు మరో రెండు కార్లలో వధువు ఊరి నుంచి వల్సాద్కు బయలుదేరారు. అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో సిటీలోకి ఎంటరయ్యారు. వారి కార్లను పోలీసులు ఆపారు. నైట్ కర్ఫ్యూ బ్రేక్ చేశారని అందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారందరినీ బెయిల్పై రిలీజ్ చేశామని డీఎస్పీ మనోజ్ సింగ్ చావ్డా చెప్పారు. కాగా పోలీసుల తీరుపై పటేల్మండిపడ్డారు.‘పోలీసుల తీరుతో నా భార్య చాలా ఇబ్బంది పడి, సిక్ అయింది. కర్ఫ్యూ రూల్ అమల్లోకి రావడానికి కొన్ని వారాల ముందే నా పెళ్లి తేది డిసైడ్అయింది. దూరం కారణంగా రాత్రి 10 లోపు మేము వల్సాద్కు రాలేకపోయాం. పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది పోయి.. పోలీసులు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి, దాదాపు రెండు గంటలపాటు అక్కడే ఉంచారు”అని పటేల్ ఆవేదన వ్యక్తం చేశాడు.