ఖైరతాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జిల్లాల్లోనే కారుణ్య నియామకాలు చేపట్టి తమకు అన్యాయం చేశారని జిల్లా పరిషత్కారుణ్య నియామక అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మాత్రమే కారుణ్య నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనే జాబ్ ఇచ్చారని.. మిగతా జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా పరిషత్ జూనియర్అసిస్టెంట్ కారుణ్య నియామకాలను చేపట్టలేదన్నారు. తమ ఫైల్సీఎస్ వద్ద ఉందని, వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. జీవో నం.79 ప్రకారం పంచాయితీరాజ్శాఖలోని అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్పోస్టులు ఇచ్చారని, జిల్లా పరిషత్శాఖలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని భవేశ్ కోరారు. సమావేశంలో నాగమణి, సాయిప్రసాద్తదితరులు మాట్లాడారు.
