మాదాపూర్, వెలుగు: వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే స్థలం ఓనర్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు, మాదాపూర్డివిజన్బీఆర్ఎస్అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వే నంబర్ 4పి,5పి, 6పిలలో 500 గజాలు చొప్పున రెండు ప్లాట్లు కొనింది. తర్వాత ఆమె అమెరికా వెళ్లగా, ఆ ప్లాట్లపై బీఆర్ఎస్నేత ఎర్రగుండ్ల శ్రీనివాస్యాదవ్కన్నేశాడు. మొత్తం వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించాడు.
రాజు క్రికెట్ అకాడమీ పేరుతో చుట్టూ ఫెన్సింగ్ఏర్పాటు చేశాడు. తర్వాత ప్లాట్లలో గుడిసెలు వేయించాడు. అమెరికా నుంచి తిరిగొచ్చిన మహిళ తన ప్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని తెలుసుకుంది. వెంటనే ఖాళీ చేయాలని శ్రీనివాస్యాదవ్ను అడగగా బెదిరించాడు. ఖాళీ చేయాలంటే తనకు రూ.5కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బ్లాక్మెయిల్చేశాడు. దీంతో బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలతో బుధవారం శ్రీనివాస్యాదవ్ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
శ్రీనివాస్ యాదవ్పై అనేక ఆరోపణలు
మాదాపూర్లో నివాసం ఉండే ఎర్రగుండ్ల శ్రీనివాస్యాదవ్శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ప్రధాన అనుచరుడు. నిత్యం ఎమ్మెల్యే వెంటే ఉంటాడు. ప్రస్తుతం మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శ్రీనివాస్యాదవ్పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే అనుచరుడు కావడం, బీఆర్ఎస్అధికారంలో ఉండడంతో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.