- ఉమ్మడి జిల్లా నేతలకు కేటీఆర్ సూచన
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఉమ్మడి జిల్లా శ్రేణులకు సూచించారు. శనివారం హైదరాబాద్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన లీడర్లతో కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు భేటి అయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు. రాజ్యసభ ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతుషిండే, జాజాల సురేందర్, బిగాల గణేశ్గుప్తా, షకీల్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, పార్టీ జిల్లాల ప్రెసిడెంట్లు ఎం.కె.ముజిబొద్దీన్, ఆశన్నగారి జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
