
- మల్లేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్/ కొల్లాపూర్, వెలుగు: హత్యా రాజకీయాలు మంచివి కావని బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్ పల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మల్లేశ్ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రక మైన సంస్కృతి మంచిది కాదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఈ కేసులో నిజానిజాలు బయటకుతీయాలని డీజీపీ, ఎస్పీలను ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కాల్ డేటాను బయట
పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హత్యకు గురైన మల్లేశ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. మల్లేశ్ భార్య నిర్మలకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు.
ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేస్తయ్
రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తాయని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) లో ఓ పోస్ట్పెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్మీడియాతో మాట్లాడిన క్లిప్ను ఆ పోస్ట్కు జత చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ ఎంపీల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ టూల్గా పని చేసిందని అన్నారు.