లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన ఫలితాలపై బీఎస్పీ చీఫ్ మాయావతి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కూటమిలోని ఇతర పార్టీలపై ఆధారపడకుండా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. సోమవారం ఉత్తరప్రదేశ్ బీఎస్పీ యూనిట్తో మాయావతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆఫీస్ బేరర్లు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని సూచించారు. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 11 సీట్లలోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు తప్పలేదు. బీజేపీ నుంచి 9 మంది, ఎస్పీ, బీఎస్పీ నుంచి చెరొకరు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో తన సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగానే బీఎస్పీ పది సీట్లు గెలుచుకోగలిగిందని, ఎస్పీ ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు ట్రాన్స్ ఫర్ కాలేదని మాయావతి చెప్పారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓడిపోయిందని, బీఎస్పీని సంస్థాగతంగానే బలోపేతం చేయాలని, ఓట్ల కోసం ఇతర పార్టీలపై ఆధారపడొద్దని సూచించారు.
ఎస్పీతో బీఎస్పీ కటీఫ్
- దేశం
- June 4, 2019
లేటెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన