
తమ చేతులనే ఉలిగా మార్చి మహానగరాలను సృష్టించిన వడ్డెరలను ధ్వంసం చేయడంలో నాజీలను మించిపోయిండ్రు మన టీఆర్ఎస్ పాలకులు అంటూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొన్ని రోజుల క్రితం గౌలిదొడ్డి (రంగారెడ్డి జిల్లా) బసవతారకనగర్ బస్తీలో వడ్డెరలపై కేసీఆర్ ప్రభుత్వపు విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేను.ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం” అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిన్న రాత్రి గౌలిదొడ్డికి వెళ్లి అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉండి, పోరాడతామని హామీ ఇచ్చారు.
తమ చేతులనే ఉలిగా మార్చి మహానగరాలను సృష్టించిన వడ్డెర (BC)లను ధ్వంసం చేయడంలో నాజీలను మించిపోయిండ్రు మన TRS పాలకులు. కొన్ని రోజుల క్రితం గౌలిదొడ్డి (రంగారెడ్డి జిల్లా) బసవతారకనగర్ బస్తీలో వడ్డెరలపై KCR ప్రభుత్వపు విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేను.ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం. #BSP4BCs pic.twitter.com/sdoEFwvvEd
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 31, 2021
‘‘బహుజన మిత్రులారా, మనం గళం ఎత్తకపోతే మనందరిని ఈ BC వడ్డెర బిడ్డల లాగానే, రోహింగ్యాల కన్నా ఘోరంగా, రోడ్డు పాలు చేసి మన ఆస్తులను ధ్వంసం చేసి ఆ శిధిలాల పై తన విలాసవంతమైన ఆకాశహర్మ్యాలను సృష్టించి రోజూ విందులు విలాసాల్లో మునిగితేలుతది ఈ ప్రభుత్వం” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
బహుజన మిత్రులారా, మనం గళం ఎత్తక పోతే మనందరిని ఈ BC వడ్డెర బిడ్డల లాగానే,రోహింగ్యాల కన్నా ఘోరంగా, రోడ్డు పాలు చేసి మన ఆస్తులను ధ్వంసం చేసి ఆ శిధిలాల పై తన విలాసవంతమైన ఆకాశహర్మ్యాలను సృష్టించి రోజూ విందులు విలాసాల్లో మునిగితేలుతది ఈ ప్రభుత్వం. #LiberateTelangana #ElephantThisTime pic.twitter.com/qNOAGZsQo9
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 31, 2021
జీవో 317 అమలు నిలిపేయాలి
జీవో 317ను అమలును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. క్యాడర్ అలాట్మెంట్లో లొసుగులు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ చానల్స్ పై ఫోకస్ పెట్టాలని ట్వీట్ చేశారు. 317ను కేవలం సీనియార్టి ప్రాతిపాదికన 317ను నిరంకుశంగా అమలు చేస్తున్నందుకే మహబూబాబాద్ లో ప్రధానోపాధ్యుడు జేత్రం చనిపోయాడని చెప్పారు.
GO317ను కేవలం సీనియారిటీ ప్రాతిపదికన నిరంకుశంగా అమలు చేస్తున్నందువల్లనే ఒక విలువైన ప్రాణం పోయింది. ఉపాధ్యాయ వర్గాలు, ప్రత్యేకించి జూనియర్లు, తీవ్ర మనోవేదనకు గురైతున్నరు. ఈ GO అమలును వెంటనే నిలిపేసి కాడర్ అలాట్మెంట్ లో లొసుగులను,సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై దృష్టి సారించాలి pic.twitter.com/LZm1t9fDs9
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 31, 2021