100 స్టోర్లను ప్రారంభిస్తాం: బీయూ4 ఆటో ప్రకటన

100 స్టోర్లను ప్రారంభిస్తాం: బీయూ4 ఆటో ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్​ కంపెనీ బీయూ4 వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వంద స్టోర్లను ప్రారంభిస్తామని ప్రకటించింది.  గుజరాత్​కు చెందిన ఈ కంపెనీ హైదరాబాద్​లో గురువారం ప్రత్యేక ఔట్​లెట్ ప్రారంభించింది. దీనిని ఎంవీ ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీయూ4 ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చైర్మన్ ఊర్విష్ షా మాట్లాడుతూ నెలకు ఐదు వేల యూనిట్లను అమ్మాలని టార్గెట్ ​పెట్టుకున్నామని చెప్పారు. 

దక్షిణాదిలో వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో  ఔట్​లెట్లను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. త్వరలో యూరాన్ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకువస్తామని షా చెప్పారు.   తాము లో-స్పీడ్ శ్రేణిలో స్టార్, షైన్, డోడో అనే మూడు మోడల్స్​ను, హై-స్పీడ్ శ్రేణిలో పీయోనీక్స్ అనే మోడల్​ను అమ్ముతున్నామని చెప్పారు.  ధరలు రూ.75 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు ఉన్నాయని షా వివరించారు.