హాంగ్జౌ: ఆసియా గేమ్స్ హెప్టాథ్లాన్లో బ్రాంజ్ మెడల్తో మెరిసిన తెలంగాణ యంగ్ అథ్లెట్ అగసర నందినిపై గత ఎడిషన్ గోల్డ్ మెడలిస్ట్ స్వప్న బర్మన్ సంచలన ఆరోపణలు చేసింది. హెప్టాథ్లాన్లో‘ట్రాన్స్జెండర్’ అథ్లెట్ చేతిలో ఓడిపోయి బ్రాంజ్ మెడల్ కోల్పోయానంటూ నందినిపై అక్కసు వెళ్లగక్కింది. ఆ పతకం తనకు ఇప్పించాలని ట్వీట్ చేసింది. తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేసింది. హెప్టాథ్లాన్లో మూడో ప్లేస్తో నందిని బ్రాంజ్ నెగ్గగా, స్వప్న నాలుగో ప్లేస్తో పతకం చేజార్చుకుంది.
బర్మన్ ఆరోపణలపై నందిని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎంతో కష్టపడి తొలి ఇంటర్నేషనల్ మెడల్ నెగ్గానని చెప్పింది. స్వప్న ఆరోపణలను ఏఎఫ్ఐ దృష్టికి తీసుకెళ్తానని తెలిపింది.