హైదరాబాద్, వెలుగు: బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ టాలీ సొల్యూషన్స్ ట్యాలీప్రైమ్3.0ని లాంచ్ చేసింది. జీఎస్టీ సొల్యూషన్, రిపోర్ట్ సామర్థ్యం పెంపు, బకాయిలను వేగంగా వసూలు చేయడంలో సహాయపడే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎస్ఎంఈలు తమ బిజినెస్లను ట్యాలీ 3.0 ద్వారా మరింత సులువుగా నిర్వహించుకోవచ్చు. ఇది వాడటం సులువని, ఎస్ఎంఈలకు తాము కొంత శిక్షణ కూడా ఇస్తామని సంస్థ జీఎం (సేల్స్) భువన్ రంజన్ చెప్పారు.
‘‘డేటా భద్రత గురించి యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్యాలీ సాఫ్ట్వేర్ను హాక్ చేయడం అసాధ్యం. దీనికోసం ప్రొప్రైటరీ డేటాబేస్ను వాడుతాం. లావాదేవీల హిస్టరీ యూజర్కు తప్ప మాకు కూడా కనిపించవు. తెలంగాణ మొత్తం 1.5 లక్షల జీఎస్టీఎన్ రిజిస్టర్డ్ ఎస్ఎంఈలు ఉన్నాయి. మాకు ఈ రాష్ట్రంలో లక్ష మంది యూజర్లు ఉన్నారు. ఇక్కడ రాబోయే రెండేళ్లలో 50 శాతం సీఏజీఆర్ సాధిస్తాం”అని అన్నారు.