
మరికల్, వెలుగు: భారత్,- పాక్ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు శుక్రవారం మరికల్లో జేఏసీ నేతలు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆయన ఫొటోతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. చౌరస్తాలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పెబ్బేరు: ఆపరేషన్ సింధూర్–2కు సంఘీభావంగా హిందూ జాగృతి సభ్యులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుభాష్చౌరస్తా నుంచి ర్యాలీ చేపట్టి, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.