
నస్పూర్, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్పరిధి కృష్ణకాలనీలో ఎంపీ ఫండ్స్ రూ.6.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సోమవారం వివేక్ యువసేన వ్యవస్థాపక ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ బరుపతి మారుతీ ప్రారంభించారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవచూపి సీసీ రోడ్డుకు నిధులు సాంక్షన్ చేశారన్నారు. పార్లమెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎంపీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. లీడర్లు, ఆటో యూనియన్, టెంపుల్కమిటీ బాధ్యులు సంఘి సదానందం, రాగిడి రాజు, సమ్మయ్య, కొల్లూరి మల్లేశ్, రాంరెడ్డి, లశెట్టి శ్రీనివాస్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.