నూతన వధూవరులకు వివేక్ వెంకటస్వామి బ్లెస్సింగ్స్​

నూతన వధూవరులకు వివేక్ వెంకటస్వామి బ్లెస్సింగ్స్​

కోల్ బెల్ట్,వెలుగు:  మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లె రాజు-శ్రీదేవి దంపతుల   కుమారుడు దీక్షిత్ -జాహ్నవిల పెళ్లి ఇటీవల జరిగింది.   వధూవరులను చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు.

 జర్నలిస్ట్ కాలనీలో పల్లె రాజు ఇంటికి  వెళ్లి కలిశారు. మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లి లో జరిగిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ లీడర్ బొలిశెట్టి కనుకయ్య -సువర్ణ దంపతుల కుమార్తె అమూల్య- అనుదీప్ పెండ్లి వేడుకలకు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తో కలిసి హాజరయ్యారు.  నూతన వధూవరులను ఆశీర్వదించారు.