చైనా, తైవాన్ బార్డర్​లో.. టెన్షన్.. టెన్షన్..!

చైనా, తైవాన్ బార్డర్​లో.. టెన్షన్.. టెన్షన్..!
  • తైవాన్ అధ్యక్షురాలి యూఎస్​ పర్యటనపై చైనా గుస్సా
  • అమెరికా వెళ్లొద్దని హెచ్చరించినా పట్టించుకోని సాయ్ ఇంగ్​వెన్​
  • ఆంక్షల దిశగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అడుగులు

బీజింగ్ : తైవాన్ అధ్యక్షురాలు సాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికా పర్యటనను చైనా ప్రెసిడెంట్ జిన్​పింగ్ తీవ్రంగా ఖండించారు. అమెరికన్ రిపబ్లిక్ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్తీతో భేటీ కావొద్దని హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ, ఇతర అమెరికన్, ఆసియా ఆధారిత సంస్థలపై ఆంక్షలు విధించేందుకు జిన్​పింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా తైవాన్ రాయబారిపై నిషేధం ప్రకటించారు. తైవాన్ వైపు భారీ యుద్ధ నౌక షాన్​డాంగ్​ను మోహరించారు. తైవాన్​పై ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తైవాన్ కూడా చైనా చర్యలను తిప్పికొడుతున్నది. గురువారం కాలిఫోర్నియాలోని రొనాల్డ్ రీగన్​ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో కెవిన్ మెక్​కార్తీతో సాయ్ ఇంగ్ వెన్ భేటీ అయ్యారు. దీన్ని నిరసిస్తూ లైబ్రరీ ముందు చైనా, తైవాన్ మద్దతుదారులు నిరసన తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతికి కృషి చేయాలని కోరారు. రీగన్ లైబ్రరీ, ఈ సంస్థలకు బాధ్యత వహిస్తున్న వ్యక్తులతో పాటు సాయ్ ఇంగ్ వెన్​తో వెళ్లిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని చైనా నిర్ణయించింది. 

తలదూర్చితే సహించబోమన్న జిన్​పింగ్

తైవాన్​తో ఒప్పందాలు చేసుకోవడమంటే చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రపంచ దేశాలకు జిన్​పింగ్ స్పష్టంచేశారు. ఇందులో తలదూర్చితే సహించేదిలేదని హెచ్చరించారు. అమెరికన్ ఇన్​స్టిట్యూట్స్, యూనివర్సిటీలతో చైనా ఎక్స్ఛేంజ్, కో ఆపరేషన్​తో పాటు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది.