వడ్లు అమ్మారా..? పైసలు పడ్డాయా..?,,యాదాద్రి జిల్లాలో స్టేట్ సివిల్సప్లయ్ విజిలెన్స్ విచారణ

వడ్లు అమ్మారా..? పైసలు పడ్డాయా..?,,యాదాద్రి జిల్లాలో స్టేట్ సివిల్సప్లయ్ విజిలెన్స్ విచారణ
  • మిల్లుల్లో తనిఖీలు చేసి, సీఎంఆర్ వివరాలు సేకరించిన ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో జరిగిన అవకతవకలపై సివిల్​సప్లయ్​విజిలెన్స్ విచారణ షురూ చేసింది. ఆరోపణలు వస్తున్న కొనుగోలు సెంటర్​తో పాటు మిల్లులను సోమవారం అధికారులు సందర్శించారు. కొనుగోలు సెంటర్లో వడ్ల అమ్మకాలపై ఆరా తీశారు. మిల్లుల్లో సీఎంఆర్​డిటెయిల్స్​, వడ్ల స్టాక్​ తనిఖీ చేశారు.  యాసంగి సీజన్​లో వడ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

 వలిగొండ మండలం సంగెంలోని పీఏసీఎస్​ కొనుగోలు సెంటర్ లో 500 బస్తాల వడ్లను కొనుగోలు చేసినట్టుగా రికార్డులు ఉండగా.. రూ. 4.64 లక్షలు సొంత అకౌంట్లలో జమ చేసుకున్నట్టు  సివిల్​సప్లయ్​ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిసెంటర్​ఇన్ చార్జ్,  అసిస్టెంట్​ ఇన్​చార్జ్,  డేటా ఎంట్రీ ఆపరేటర్​పై కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 4.14 లక్షలు రికవరీ కూడా చేశారు. పీఏసీఎస్​ సీఈవో ముత్యాలుకు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు.

కాగా జిల్లాలో వడ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సివిల్​సప్లయ్​ విజిలెన్స్​ ఓఎస్​డీ అంజయ్య, ఏసీపీ యాదయ్య, కమాల్​పాష సోమవారం సంగెం సెంటర్ లో వడ్లు అమ్మిన జాబితాలోని పలువురు రైతులను కలిశారు. వడ్లు అమ్మారా..? డబ్బులు వచ్చాయా..? అని ఆరా తీశారు. అయితే 500 బస్తాల అక్రమాలపై నిర్ధారణకు వచ్చారు. అనంతరం సంగెం కొనుగోలు సెంటర్​నుంచి వడ్లు వెళ్లిన ధాన్యలక్ష్మి, సోమేశ్వర మిల్లులను సందర్శించి వడ్ల నిల్వలను తనిఖీ చేశారు.

సీఎంఆర్​ కోసం వచ్చిన వడ్ల స్టాక్​ వివరాలతో పాటు పెండింగ్​సీఎంఆర్, టెండర్​వడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లోని సివిల్​సప్లయ్​ఆఫీసుకు వెళ్లి విజిలెన్స్​ ఆఫీసర్లు డీఎం హరికృష్ణను కలిశారు. ఆర్ఆర్​యాక్ట్​ నమోదు చేసిన ఎల్ఎన్​ రెడ్డి, లక్ష్మి ఇండస్ట్రీస్​ మిల్లులపై ఆరా తీశారు. వీటికి  సంబంధించిన కేసు వివరాలను తీసుకొని, కేసు స్టేటస్​, కోర్టులో కౌంటర్​ దాఖలుపైనా అధికారులను  ప్రశ్నించారు.

రూ. 10 కోట్లు చెల్లించాల్సిన డిఫాల్ట్​మిల్లు ఎల్ఎన్​ఆగ్రోపైనా ప్రశ్నించారు. ఆ మిల్లులో కేవలం 4200 టన్నుల టెండర్​ వడ్లు మాత్రమే ఉన్నాయని, వాటిని వేలం వేయడానికి స్టేట్​ఆఫీసు అనుమతి కోరినట్టు డీఎం తెలిపారు. ఆయా మిల్లుల ఆస్తులను అమ్మకుండా ఫ్రీజ్​చేయించినట్టు వివరించారు. మిల్లుల ఆస్తుల వివరాలను విజిలెన్స్​ఆఫీసర్లు అడిగి తెలుసుకుని అనంతరం కేసుల డాక్యుమెంట్స్ తో హైదరాబాద్​కు వెళ్లిపోయారు.