ఉద్యమకారులను కేసీఆర్​ మోసం చేసిండు: వివేక్

ఉద్యమకారులను కేసీఆర్​ మోసం చేసిండు: వివేక్

‘‘ఉద్యమకారులను కేసీఆర్​ మోసం చేసిండు.. ప్రొఫెసర్​ కోదండరాంను కూడా వాడుకొని.. అధికారంలోకి రాగానే వదిలేశాడు. కేసీఆర్​ చేతిలో మోసపోయిన వారిలో నేను ఒక బాధితుణ్ణి..” అని  వివేక్​ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి  మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీకృష్ణాఫంక్షన్​ హాల్​లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివేక్​ వెంకటస్వామి, కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడారు. చెన్నూర్​లో బాల్క సుమన్​ ఇసుక దందాతో వేయి కోట్లు దండుకున్నాడని, కేసీఆర్​ కాళేశ్వరం రీ డిజైన్​ పేరుతో రూ.70 వేల కోట్లను మింగాడని వివేక్ ఆరోపించారు.  

చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన బాల్క సుమన్ ఒకసారైనా రాలే అనే మాటే వినిపించిందన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా  ప్రజా సేవలోనే ఉంటానని, చెన్నూరు  ప్రజలకు అందుబాటులో ఉంటానని వివేక్​ హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే అసంపూర్తిగా మారిన లెదర్​ పార్క్​ను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు