
నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్బీఫామ్స్ అందజే శారు. ఆదివారం హైదరాబాద్ప్రగతి భవన్లో జరిగిన సమావేశం అనంతరం జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి సహా ఎమ్మెల్యేలకు భీఫామ్స్ ఇచ్చి ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించిన అందరికీ భీపామ్స్ ఇవ్వడంతో క్యాండిడేట్లను మారుస్తారన్న ప్రచారానికి తెరపడింది.