![ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ](https://static.v6velugu.com/uploads/2024/04/cm-revanth--reddy-public-meeting-at-hanumakonda-on-april-21_qRLiYv0FO1.jpg)
కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో కాజీపేట మండలం మడికొండలోని సభా స్థలాన్ని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేపూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్నాగరాజు పరిశీలించారు. సీఎం మాట్లాడేందుకు స్టేజీ, పార్కింగ్, ఇతర వసతుల ఏర్పాట్లపై చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు.