వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి వనపర్తిలో చదువుకున్న స్కూల్, జూనియర్ కాలేజీని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. స్కూల్, కాలేజీ డెవలప్ మెంట్కు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని చెప్పారు.
సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్ గ్రౌండ్లో బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ భవనం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన సౌలతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్కు సూచించారు.
అనంతరం మరికుంట మెడికల్ కాలేజీ సమీపంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్కు భూమిపూజ చేశారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు బి.కృష్ణ, బ్రహ్మంచారి, సాయి చరణ్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ రమేశ్, చిన్నకృష్ణ, చీర్లసత్యం పాల్గొన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ..
రేవల్లి/ఏదుల: రేవల్లి, ఏదుల మండలాలకు సంబంధించిన మహిళలకు సోమవారం గోపాలపేటలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
డీఆర్డీవో ఉమాదేవి, అడిషనల్ డీఆర్డీవో సుజాత, డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, నాయకులు సత్యశీలారెడ్డి, జమ్మి మల్లేశ్, సురేశ్ గౌడ్, సుల్తాన్ అలీ, వేణుగోపాల్, లింగస్వామి, మిద్దె రాములు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప పాల్గొన్నారు.-
