
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్స్టైల్, జ్యూయలరీ స్టోర్లు నిర్వహించే సీఎంఆర్షాపింగ్ మాల్ విస్తరణ బాట పట్టింది.హైదరాబాద్లోని మియాపూర్లో బుధవారం కొత్త స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దీనిని ప్రారంభించారు. రిటైర్డ్ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, కార్పొరేటర్జగదీశ్వర రావు తదితరులు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 40 ఏళ్లుగా తమ సంస్థను ఎంతగానో ఆదరిస్తున్నారని, నాలుగు రాష్ట్రాల్లో తమకు 40కిపైగా శాఖలు ఉన్నాయని చెప్పారు.
సీఎంఆర్లో షాపింగ్ప్రపంచస్థాయి అనుభూతిని ఇస్తుందని, అన్ని రకాల వేడుకలకు కావాల్సిన వస్త్రాలను కొనుక్కోవచ్చని చెప్పారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను అతి తక్కువ ధరలకు ఇస్తున్నామని రమణ వివరించారు. సీఎంఆర్జ్యూయలరీ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు నగలపై ఫ్లాట్9 శాతం తరుగు, కేజీ వెండి నగలపై రూ.12,500 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు మృణాల్ ఠాకూర్, బుల్లిరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.