![శ్రీశైల ఆలయ గోపురంపై నాగుపాము](https://static.v6velugu.com/uploads/2023/10/cobra-on-the-gopuram-of-srisailam-temple_pRWNQHV0YC.jpg)
శ్రీశైలంలో ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము కలకలం రేపింది. ఈరోజు(అక్టోబర్ 15) నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీకి గోపురంని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బందికి నాగుపాము కనిపించింది. దీంతో ఆలయ సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే దేవస్థానం అధికారులకు తెలియజేశారు. దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ కి సమాచారం ఇవ్వడంతో.. అతను శివాజీ గోపురంపైకి ఎక్కి నాగుపాముని పట్టుకొని అడవి ప్రాంతంలో పాముని వదిలేశాడు.
Also Read : మేరీలాండ్లో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయిన రోజే శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యేక్ష్యం కావడంతో.. ఉత్సవాలను తిలకించేందుకు నాగుపాము వచ్చిందని భక్తులు చర్చించుకుంటున్నారు.