పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలి : హనుమంతు జెండగే 

పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలి : హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు: ఈనెల 12 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 ఏండ్ల వారికి అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలని కలెక్టర్​ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు.  బుధవారం  జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని  21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 901 అంగన్వాడీ కేంద్రాలు, 647 ప్రభుత్వ , 146 ప్రైవేట్ పాఠశాలలు, 38 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్  , 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సంబంధించి మొత్తం 1,61, 650 మంది పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలన్నారు.

ఆ రోజు మిస్సైన వారికి  ఈ నెల 19న టాబ్లెట్లు వేయాలని సూచించారు. ఒకటి నుంచి 2  ఏండ్ల పిల్లలకు సగం టాబ్లెట్, 2 నుంచి 19 ఏండ్ల పిల్లలకు ఒక మాత్ర వేయాలన్నారు.   ఈ సమావేశంలో ఇన్‌‌చార్జి డీఎంహెచ్‌‌వో డాక్టర్ యశోద, డీఈవో కె.నారాయణరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి అన్నపూర్ణ, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వినోద్ ఉన్నారు.