ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో నోడల్ ,  మండల స్థాయి అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, సమాచారం తదితర అంశాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమించారు.  

ఓటర్ల జాబితా పరిశీలించాలన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు,  కరెంట్, ర్యాంపుల వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.  అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్,  సబ్​ కలెక్టర్​ కిరణ్మయి,  సీఈవో  చందర్​నాయక్​, డీపీవో మురళి,  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.

వయోవృద్ధుల అనుభవం సమాజానికి అవసరం

కామారెడ్డిటౌన్​: వయోవృద్ధుల అనుభవం సమాజానికి అవసరమని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం   అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం  సందర్భంగా ఈ ఏడాది ‘మన ఆకాంక్షలు,  మన శ్రేయస్సు,  మన హక్కులు’ అనే థీమ్​తో   జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 

వయోవృద్ధులకు గౌరవం,  ఆరోగ్యం, భద్రత  కల్పించటం ముఖ్యమన్నారు.  సంఘ బిల్డింగ్​ ఆవరణలో  మొక్కలు నాటారు.  జిల్లా వయోవృద్ధుల సంక్షేమ అధికారి ప్రమీల,  రెడ్​ క్రాస్​ సొసైటీ చైర్మన్​ ఎం.రాజన్న, తహసీల్దార్​ జనార్దన్​, సీనియర్​ సిటిజన్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు పున్న రాజేశ్వర్, నిట్టు విఠల్​రావు తదితరులు పాల్గొన్నారు.