ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నాగర్​ కర్నూల్​ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లోని మీటింగ్ హాలులో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, భీమ్లా నాయక్​తో కలిసి ప్రిసైడింగ్​, అసిస్టెంట్​ప్రిసైడింగ్​ అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలో అధికారులు, ఎంపీడీవోల బాధ్యత అత్యంత కీలకమన్నారు.

 జిల్లాలో 5 వేల మించి జనాభా ఉన్న  గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.లక్ష 50 వేలు 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు రూ.లక్ష 50 వేలు, వార్డు సభ్యులు రూ.30 వేల వరకే ఖర్చు చేయాలని ఆదేశించారు. 

 అనంతరం కలెక్టర్​ నాగర్​ కర్నూల్​ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో జిల్లా రవాణా అధికారి ఆఫీస్​ను సందర్శించారు. అధికారులు, ఉద్యోగుల హాజరు, పనితీరు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న  సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి చిన్న బాలు నాయక్, ఆర్టీవో ఇన్​స్పెక్టర్లు మహేశ్, అనూప్ రెడ్డి, రాజశేఖర్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.