సీజనల్​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :  కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​

సీజనల్​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :  కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. వ్యాధులు వ్యాప్తి చెందనున్న దృష్ట్యా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. నీరు నిల్వ ఉండొద్దని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వివరాలను రిజిస్టర్​లో నమోదు చేయాలని పేర్కొన్నారు. జూన్​3 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న టెన్త్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.