కోల్బెల్ట్, వెలుగు: మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ఆయన పర్యటించారు. మున్సిపల్ కమిషనర్లు రాజు, రాజలింగుతో కలిసి ఇదివరకు చేపట్టిన అభివృద్ది పనులు, డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం మంజూరైన అమృత్ 2.0 స్కీం పనుల పురోగతిని పరిశీలించారు.
శానిటేషన్, నర్సరీల నిర్వహణ, గతంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మౌలిక వసతులపై ఆరా తీశారు. వార్డుల్లో ప్రతీరోజు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్యార్డులకు తరలించాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ఆఫీస్లలో రిజస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు.
యూనియన్ బ్యాంక్ ప్రారంభం
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ను కలెక్టర్కుమార్దీపక్ శుక్రవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ రాధాకృష్ణతో కలిసి ప్రారంభించారు. లీడ్ డిస్ట్రిక్ట్మేనేజర్ తిరుపతి, బ్యాంకు మేనేజర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
