ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత : వల్లూరు క్రాంతి

ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత : వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు : ఎన్నికల లెక్కింపు అనంతరం సామగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్  వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం గోనుపాడు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీలో గద్వాల, అలంపూర్  నియోజవర్గాలకు సంబంధించిన ఎన్నికల మెటిరియల్​ను ట్రంక్  పెట్టెల్లో భద్రపరచి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో సీల్​ వేశారు.

భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్  తెలిపారు. అడిషనల్  కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, శ్రీనివాసులు ,ఆర్డీవో చంద్రకళ, ఎస్డీసీ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు నరేందర్, సరితారాణి, సూపరింటెండెంట్  నరేశ్ పాల్గొన్నారు.