V6 News

పోలింగ్ స్టాఫ్ వద్ద హ్యాండ్బుక్ తప్పనిసరి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

 పోలింగ్ స్టాఫ్ వద్ద హ్యాండ్బుక్ తప్పనిసరి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • ఓటింగ్ కంపార్ట్​మెంట్​లోకి ప్రవేశం నిషేధం
  • కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి 

నిజామాబాద్,  వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాఫ్​ ప్రతి అనుమానాన్ని హ్యాండ్​బుక్ చదివి క్లారిఫై చేసుకోవాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. సొంత నిర్ణయాలు వివాదాలకు కారణమవుతాయన్నారు. శుక్రవారం థర్డ్​ ఫేజ్​ జీపీ ఎన్నికల పీవోలకు ముప్కాల్ మండలంలోని రైతు వేదికలో మాస్టర్​ ట్రైనర్స్​తో శిక్షణ ఇప్పించి మాట్లాడారు. ఎన్నికల కమిషన్​ గైడ్​లైన్స్​పై అవగాహన ఉంటే ఎక్కడ ఇబ్బంది రాదన్నారు. 

ఓటర్​ స్లిప్​ ఐడీ కార్డుకాదని ఎస్​ఈసీ సూచించిన విధంగా 18 రకాల ఐడీ ప్రూఫ్​ల్లో ఏది ఉన్నా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పీవోగాని ఏపీవోగానీ ఎట్టి పరిస్థితిలో ఓటింగ్​ కంపార్ట్​మెంట్​లోకి ఎంటర్ కావద్దని సూచించారు. ఓటర్ల వెంట సహాయకులుగా వచ్చే వారి కుడి చేతి మధ్య వేలికి సిరా చుక్క వేయాలన్నారు. 

మక్కజొన్న పేమెంట్​కు రూ.10 కోట్లు రిలీజ్​

జిల్లాలో మక్కజొన్న అమ్మిన రైతులకు బిల్ చెల్లింపు కోసం రూ.10 కోట్లు రిలీజ్​ అయ్యాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. మార్క్​ఫెడ్​ ద్వారా 33 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 2,63,016 క్వింటాళ్లు కొనుగోలు చేశామని, క్వింటాల్​కు రూ.2,400 చొప్పున పేమెంట్​ చేస్తామన్నారు.