- కైనన్ టీమ్కు సిల్వర్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, ఇండియా యంగ్ షూటర్ అనీశ్ భన్వాల పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు. ఆసియా చాంపియన్షిప్స్లో మెన్స్ 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో బ్రాంజ్ మెడల్ నెగ్గి ఇండియా తరఫున ఒలింపిక్ షూటింగ్లో 12వ బెర్త్ సొంతం చేసుకున్నాడు. 21 ఏండ్ల భన్వాల సోమవారం జరిగిన ఫైనల్లో 28 హిట్స్తో బ్రాంజ్ నెగ్గాడు.
మెన్స్ ట్రాప్లో హైదరాబాదీ కైనన్ చెనాయ్, జోరావర్ సింగ్, పృథ్వీరాజ్తో కూడిన ఇండియా టీమ్ సిల్వర్ గెలిచింది. ఫైనల్లో ఈ త్రయం 341 స్కోరుతో రెండో స్థానం సాధించింది.