కొడంగల్, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులతో సోమవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ డీఈఈ సురేందర్ మాట్లాడుతూ.. రోడ్డుకు అడ్డంగా ఉన్న 107 నిర్మాణాలను తొలగించనున్నట్లు తెలిపారు. బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు కూల్చడం ఏంటని కొందరు అధికారులను నిలదీశారు. తమకు మార్కెట్ రేటుకు తగ్గకుండ పరిహారం, ప్లాట్లు అందించాలని డిమాండ్ చేశారు.
