అజారుద్దీన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

అజారుద్దీన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. టికెట్ల విక్రయం విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై  క్రిమినల్ కేసు నమోదుచేసి పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో అభ్యర్థించారు. 

జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు హెచ్సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని యుగంధర్ ఆరోపించారు. ఉప్పల్లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ ఏర్పాట్ల విషయంలో హెచ్సీఏ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. క్రీడాభిమానుల నుంచి లక్షల రూపాయలు దండుకొని టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని హెచ్సీఏ నిర్వాహకులుగానీ, రాజకీయ నాయకులుగానీ పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.