నిజామాబాద్‌లో ఒక్కరోజులో 16,995 కరోనా కేసులు!

నిజామాబాద్‌లో ఒక్కరోజులో 16,995 కరోనా కేసులు!

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. జిల్లాల్లో కూడా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య జిల్లా ప్రజలను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా.. జిల్లాలో ఏప్రిల్ 27 మంగళవారం 43,571 కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే అంతకుముందు రోజు సోమవారం ఏప్రిల్ 26న మాత్రం 26,576 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. అంటే ఒక్క రోజు తేడాలోనే 16,995 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దాంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలో పడ్డారు. అసలు ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలు కరెక్టేనా అని జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.