వివేక్​ వెంకటస్వామితోనే అభివృద్ధి : కాంగ్రెస్, సీపీఐ​ లీడర్లు

వివేక్​ వెంకటస్వామితోనే అభివృద్ధి : కాంగ్రెస్, సీపీఐ​ లీడర్లు
  • మీడియా సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ​ లీడర్లు 

కోల్​బెల్ట్​, వెలుగు: ఎమ్మెల్యే  డాక్టర్​ గడ్డం వివేక్ వెంకటస్వామితోనే చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్, సీపీఐ​ లీడర్లు  ఆశాభావం వ్యక్తం చేశారు.  వివేక్​ వెంకటస్వామి విజయం సాధించడాన్ని పురస్కరించుకొని  సోమవారం రామకృష్ణాపూర్​లోని కాంగ్రెస్ ఆఫీస్​లో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ వివేక్​ వెంకటస్వామిని గెలిపించినందుకు ప్రజల రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటారన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించాలని కోరారు. బాల్క సుమన్​ అవినీతి, అహంకార పాలనకు ప్రజలు చరమగీతం పాడి గట్టి బుద్ది చెప్పారన్నారు.  కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా వివేక్​ వెంకటస్వామిని గెలిపించారన్నారు. వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయన్నారు.  

మందమర్రి, రామకృష్ణాపూర్​లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, 45వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివేక్​ వెంకటస్వామి కట్టుబడి ఉన్నారన్నారు.  క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మించి అందుబాటులోకి  తీసుకరానున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకు 286  డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లను ఇప్పించేందుకు కృషి చేస్తారన్నారు.   సమావేశంలో కాంగ్రెస్​ లీడర్లు రాఘునాథ్​రెడ్డి, పల్లెరాజు, ఎండి.అబ్దుల్​అజీజ్, మహంకాళీ శ్రీనివాస్, గోపతి రాజయ్య, యాకుబ్ అలీ, చంద్రగిరి ఎల్లయ్య, రాజేశ్, ఆకుల రాజన్న, సత్యపాల్, మెట్టె సుధాకర్, సీపీఐ లీడర్లు మిట్టపెల్లి శ్రీణివాస్​, వనం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.