దేశ విభజన కుట్రలు సహించం .. రాజ్యసభలో మోదీ

దేశ విభజన కుట్రలు సహించం .. రాజ్యసభలో మోదీ


ఢిల్లీ: దేశాన్ని విభజించే కుట్రలను సహించబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా దక్షిణాదిపై టార్గెట్ గా ప్రసంగించారు. కొందరు దక్షిణ భారత దేశం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంటే దేహం లాంటిదని, దానిని ముక్కలు కానివ్వబోమని అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఇబ్బంది కలిగినా దేశం మొత్తానికి ఇబ్బందేనని అన్నారు. 

ఒకరు భాష కోసం కొట్లాడుతారు. హిమాలయాలు నదులు నా వల్లే ప్రవహిస్తున్నాయంటే నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లాలి..? అన్నారు. నిధుల కోసం ఓ రాష్ట్రం ఢిల్లీలో ధర్నా చేసిందన్నారు. మరో రాష్ట్రం మా బొగ్గు మాకే కావాలంటోందని, ఇంకో స్టేట్.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష లేదని అన్నారు. రాష్ట్రాల హక్కులకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. త్వరలో మోదీ మూడో ఇన్నింగ్స్ స్టార్టవుతుందని చెప్పారు. 

కాంగ్రెస్ టార్గెట్

మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లుకూడా రావన్నారు. ఆ పార్టీ మూలాలే బ్రిటీషర్లవని చెప్పారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు

ALSO READ :- కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ? .. సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమన్న హైకోర్టు!