బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఎస్.సిద్ధరామయ్య బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బీజేపీ లీడర్లు తాలిబాన్లు అని.. వారిది హిట్లర్ వంశం అని సిద్ధరామయ్య చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు ధీటుగా కామెంట్లు చేస్తున్నారు. సిద్ధరామయ్య ఓ టెర్రరిస్టు అని కర్నాటక బీజేపీ చీఫ్ నలీన్ కుమార్ కతీల్ అన్నారు.
‘సిద్ధరామయ్య నాకు ఉగ్రవాదిలా కనిపిస్తారు. కాంగ్రెస్లో అంతర్గతంగా ఉన్న పరిస్థితుల వల్లే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. సిద్ధరామయ్య పాటించే సంస్కృతి తాలిబాన్ల మాదిరిగా ఉంటుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో కర్నాటకలో ఎన్నో హత్యలు జరిగాయి’ అని నలీన్ కుమార్ ఆరోపించారు.