తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు చేపట్టారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కోవిడ్ రివ్యూలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ కట్టడికి వివిధ శాఖలకు చెందిన వారు తమవంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త
మిళనాడులో శుక్రవారం 219 కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కుటుంబంలోని ఓ వ్యక్తిని కోవిడ్ లక్షణాలు కనిపిస్తే...సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ కట్టడికి ముఖానికి మాస్కులు ధరించాలని..సామాజిక దూరం పాటిస్తూ..కోవిడ్ రూల్స్ పాటించాలని తెలిపారు. కరోనా వైరస్పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే సరైన ఆయుధమన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 93.82 శాతం మందికి మొదటి డోస్ వేయగా..82.94 శాతం మందికి సెకండ్ డోస్ వేశామని సీఎం స్టాలిన్ చెప్పారు.