భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 65 వేలకు పైగా కేసులు నమోదవున్నాయి. నిన్న(ఆగస్టు 21న) 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. మరో 945 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 55,794 కు చేరింది. ఇక 22,22,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,97,330 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్ లో రోజు వారీ కరోనా టెస్టుల సంఖ్య 10 లక్షల మార్క్ కు చేరుకుంది. ఆగస్టు 21న 10,23,836 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 3,44,91,073కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
Spike of 69,878 cases and 945 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 29,75,702 including 6,97,330 active cases, 22,22,578 cured/discharged/migrated & 55,794 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/a9QR8C0OUg
— ANI (@ANI) August 22, 2020