మొత్తం ఇంత మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

మొత్తం ఇంత మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

కరోనా వైరస్​ 156 దేశాలకు పాకింది. 1,62,501 మందికి సోకింది. 6,068 మందిని బలి తీసుకుంది. ఎక్కువ మరణాలు చైనాలోనే నమోదైనా, ఇటలీలో కేసులు, మరణాలు పెరుగుతుండడం కలవర పెడుతోంది. చైనాలో 80,849 మందికి వైరస్​ సోకగా 3,199 మంది చనిపోయారు. ఇటలీలో కేసుల సంఖ్య 21,157కి పెరిగింది. 1,441 మంది చనిపోయారు. ఇరాన్​లో 13,938 కేసులు రికార్డయ్యాయి. 724 మంది చనిపోయారు. స్పెయిన్​లో 291, ఫ్రాన్స్​లో 91, సౌత్​కొరియాలో 75, అమెరికాలో 60 మంది చనిపోయారు. బ్రిటన్​లో 21, జపాన్​లో 24, నెదర్లాండ్స్​లో 20 మంది కరోనాకు బలయ్యారు.

బ్రిటన్​ రాణిని తరలించారు

బ్రిటన్​ రాణి ఎలిజబెత్​II, ఆమె భర్త ఫ్రిన్స్​ ఫిలిప్​ను అధికారులు లండన్​లోని బకింగ్​హాం ప్యాలెస్​ నుంచి విండ్సర్​ కెజిల్​కు ఆమెను తీసుకెళ్లారు. ఇద్దరినీ నోర్ఫోక్​లోని శాండ్రింగాం ఎస్టేట్​లో క్వారెంటైన్​లో పెడతారని చెబుతున్నారు.