కరోనా వైరస్ 156 దేశాలకు పాకింది. 1,62,501 మందికి సోకింది. 6,068 మందిని బలి తీసుకుంది. ఎక్కువ మరణాలు చైనాలోనే నమోదైనా, ఇటలీలో కేసులు, మరణాలు పెరుగుతుండడం కలవర పెడుతోంది. చైనాలో 80,849 మందికి వైరస్ సోకగా 3,199 మంది చనిపోయారు. ఇటలీలో కేసుల సంఖ్య 21,157కి పెరిగింది. 1,441 మంది చనిపోయారు. ఇరాన్లో 13,938 కేసులు రికార్డయ్యాయి. 724 మంది చనిపోయారు. స్పెయిన్లో 291, ఫ్రాన్స్లో 91, సౌత్కొరియాలో 75, అమెరికాలో 60 మంది చనిపోయారు. బ్రిటన్లో 21, జపాన్లో 24, నెదర్లాండ్స్లో 20 మంది కరోనాకు బలయ్యారు.
బ్రిటన్ రాణిని తరలించారు
బ్రిటన్ రాణి ఎలిజబెత్II, ఆమె భర్త ఫ్రిన్స్ ఫిలిప్ను అధికారులు లండన్లోని బకింగ్హాం ప్యాలెస్ నుంచి విండ్సర్ కెజిల్కు ఆమెను తీసుకెళ్లారు. ఇద్దరినీ నోర్ఫోక్లోని శాండ్రింగాం ఎస్టేట్లో క్వారెంటైన్లో పెడతారని చెబుతున్నారు.