కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌కు కరోనా

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌కు కరోనా

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే గురువారం ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్లో చేరా. ఇటీవల నన్ను కలిసిన వారు హోంక్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని షెకావత్ ట్వీట్ చేశారు. షెకావత్ మంగళవారం రెండు మీటింగులు నిర్వహించారు. సట్లెజ్ యమున లింక్ పై నిర్వహించిన మీటింగ్లో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్, అధికారులు ఫిజికల్గా, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వర్చువల్గా హాజరయ్యారు.

For More News..

కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే.. ఆస్ట్రేలియాలో 10 లక్షల మంది తగ్గుతరట