ముంబై: దివాలా తీసిన రిలయన్స్ క్యాపిటల్ను కొనడానికి కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్రూ. 4,500 కోట్ల ఆఫర్ను ఇచ్చింది. హిందుజా గ్రూప్, ఓక్ట్రీ క్యాపిటల్, టోరెంట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా రిలయన్స్ క్యాపిటల్ను కొనాలని చూస్తున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ను మాత్రమే కొనడానికి మరో ముగ్గురు బిడ్డర్లూ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
రిలయన్స్ క్యాపిటల్ కొనేందుకు రూ. 4,500 కోట్లు చెల్లిస్తానని, ఆ తర్వాత కంపెనీ నిర్వహణ కోసం మరో రూఏ. 1,060 కోట్లను ఇస్తానని కాస్మియా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ను మాత్రమే కొనడానికి మరోవైపు పిరమల్ నాయకత్వంలోని జూరిచ్ ఇన్సూరెన్స్ బిడ్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఫౌండర్ శామ్ ఘోష్ 2017 దాకా రిలయన్స్ క్యాపిటల్కు నాయకత్వం వహించారు. రిలయన్స్ క్యాపిటల్ను కొనడానికి ఇంకోవైపు హిందుజా గ్రూప్ రూ. 4,000 కోట్లకు, ఓక్ట్రీ క్యాపిటల్ రూ. 4,000 కోట్లకు బిడ్స్ వేశాయి.
ఇనసాల్వెన్సీ ఎదుర్కొంటున్న రిలయన్స్ క్యాపిటల్ను చేజిక్కించుకోవడానికి మొత్తం 14 దాకా బిడ్స్ వచ్చాయి. రూ. 7 వేల కోట్లతో యాడ్వెంట్ ఇంటర్నేషనల్ హైయ్యస్ట్ బిడ్డర్గా నిలుస్తోంది. అయితే నాన్ బైండింగ్ ఆఫర్లు చివరివరకూ మారే వీలుంటుందని, దీనిని కచ్చితమని పరిగణించలేమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ నిప్పన్ లైఫ్ఇన్సూరెన్స్లోని రిలయన్స్ క్యాపిటల్ 51 శాతం వాటాకు వేరుగా బిడ్స్ ఏవీ అడ్మినిస్ట్రేటర్ వై నాగేశ్వర రావుకు చేరలేదని ఆ వర్గాలు తెలిపాయి.
రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్లో జపాన్ కంపెనీ నిప్పన్లైఫ్కు 49 శాతం వాటా ఉంది. ఆథమ్, యూవీ ఎసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, బీ రైట్ రియల్ ఎస్టేట్ వంటి కంపెనీలు కూడా రిలయన్స్ క్యాపిటల్ కొనాలని ప్రయత్నిస్తున్నాయి.