న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
12 నుంచి 14 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీకి నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్రం బుధవారం నుంచి 12 నుంచి 14 ఏళ్ల వారికి టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇవాన్ సంస్థ అభివృద్ధఇ చేసిన టీకాను పిల్లలను ఇవ్వనున్నారు.