యాదగిరి నర్సన్నను దర్శించుకున్న రాచకొండ సీపీ

యాదగిరి నర్సన్నను దర్శించుకున్న రాచకొండ సీపీ

యాదగిరిగుట్ట దేవాలయం నిర్మాణం అద్భుతంగా జరిగిందని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్టను ఎంతో గొప్పగా పునర్నిర్మించారని ప్రశంసించారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

యాదగిరిగుట్టలో ఏర్పాట్లపై స్థానిక పోలీస్ అధికారులు, దేవాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని సీపీ చౌహాన్ స్పష్టం చేశారు. గుట్టలో శాంతి, భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు. రాచకొండ కమిషనర్ పరిధిలోని ప్రజలకు సేవలందించేందుకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి తనకు బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.  స్వామివారి కృపతో శాంతి, భద్రతలు కాపాడేందుకు నిర్విరామంగా కృషి చేస్తానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.