
పాలమూరు, వెలుగు: అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్ష మహబూబ్నగర్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ ఎగ్జామ్ ప్రారంభం కాగా.. కాసేపటికే షార్ట్ సర్క్యూట్తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంప్యూటర్లు షట్ డౌన్ అయ్యాయి. విద్యాలయం నిర్వాహకులు విషయాన్ని నేషనల్ టెస్టింగ్ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లారు. వారు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.